మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన‌ విజయం, తప్పిన క్లీన్‌స్వీప్‌

India vs Australia 3rd ODI: India Beat Australia By 13 Runs,India vs Australia,India vs Australia 3rd ODI,India Beat Australia By 13 Runs,India Beat Australia,Mango News,Mango News Telugu,India vs Australia 3rd ODI Highlights,India Beat Australia By 13 Runs In Third ODI,India vs Australia,India Beat Australia By 13 Runs,India vs Australia Highlights,India vs Australia 2020,3rd ODI India vs Australia 2020 Highlights,Ind vs Aus,India vs Australia 3rd ODI Report,Australia,India

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు బోణి కొట్టింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలిరెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు మూడో వన్డే లో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ తప్పించుకుంది. కాన్ బెర్రా వేదికగా బుధవారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 13 పరుగులతో భారత్ విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. భారత్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ (16 ) పరుగులకే వెనుదిరగగా, శుబ్ మన్ గిల్ (33) తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ధాటిగా ఆడాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్(19), కెఎల్ రాహుల్(5) పరుగులతో వెంటవెంటనే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా వన్డేల్లో 60వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకుని 63 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాతో కలిసి‌ ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోన్నారు. హార్దిక్ పాండ్యా(92), జడేజా(66) లు కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 303 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో అగర్ మూడు వికెట్లు తీయగా, ఆడమ్ జాంపా, అబాట్, హాజల్ వుడ్ తలో వికెట్ పడగొట్టారు.

మరోవైపు 303 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్సమెన్లలో ఆరోన్ పించ్ (75), మాక్స్ వెల్(59) మాత్రమే రాణించారు. అలాగే లబుషేన్‌ 7, స్టీవ్ స్మిత్ 7, హెన్రిక్స్ 22, గ్రీన్ 21, అలెక్స్ కారే‌ 38, అగర్‌ 28 పరుగులు చేసి వెనుదిరిగారు. మాక్స్ వెల్ పోరాటంతో ఒక దశలో విజయంవైపు సాగుతున్న ఆస్ట్రేలియా జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో భారత్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, బుమ్రా 2, నటరాజన్ 2, రవీంద్ర జడేజా 1, కుల్దీప్‌ యాదవ్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =