దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2, మంగళవారం నాడు కూడా 3944 కరోనా కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,78,324 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,342 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 5,329 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,38,680 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 93.1 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 30,302 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మంగళవారం నాటికీ ఢిల్లీ నగరంలో 63,46,521 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ