ఐపీఎల్-2022లో భాగంగా ముంబయి బ్రబౌర్న్ స్టేడియంలో మార్చి 28, ఆదివారం నాడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టీ20 మ్యాచులో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షలు జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మొదటగా బ్యాటింగ్ ఏంచుకోగా, ఢిల్లీ ముందు 178 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
కాగా రెండో ఇన్నింగ్స్ సమయంలో తమ ఓవర్ల కోటాను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడంలో ముంబయి ఇండియన్స్ జట్టు విఫలమైంది. దీంతో మినిమమ్ ఓవర్ రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఈ సీజన్లో చేసిన ముంబయి ఇండియన్స్ చేసిన మొదటి తప్పిదంలో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల రూపాయల జరిమానా విధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఐపీఎల్ 2022లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ