జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మొదటి సెషన్కు సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మెయిన్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో విడుదల చేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫైనల్ కీని ఈ నెల 6వ తేదీన విడుదల చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యశ్వంత్, పీ. ఆదినారాయణ, కే. సుహాస్, కే. ధీరజ్, అనికేత్ చటోపాధ్యాయ, బి. రూపేశ్, పి. రవి కిశోర్, పి. కార్తికేయ 100% శాతం సాధించడం విశేషం.
తాజా ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, nta.ac.in మరియు ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ, బీటెక్) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. కాగా పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్ జరుగుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నేటితో గడువు ముగియనుంది. జేఈఈ ప్రధాన సెషన్ 2 జూలై 21 నుండి జూలై 30, 2022 వరకు జరగాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ