ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘సానుకూల వైఖరిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి’ అనే అంశంపై మాట్లాడారు. ఒక మనిషి చూసే దృక్పధం బట్టే తన స్థితిగతులు మారుతాయని, దృక్పధం పాజిటివ్ గా ఉంటే అద్భుతం జరుగుతుందని అదే నెగటివ్ గా ఉంటే అసంతృప్తి బారిన పడతారని వివరించారు. సానుకూల వైఖరి కోసం అవలంభించాల్సిన పద్ధతులను ఆసక్తికర విధానంలో తెలియజేసారు. పూర్తి స్థాయి వివరణ కోసం ఈ కింది వీడియో చూడండి. 👇
- Advertisement -