దేశంలో కరోనా విజృంభణతో జూలై 26, ఆదివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 13,85,552 కు చేరుకుంది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మరణాలు ఎక్కువుగా నమోదవుతుండడంతో అత్యవసర మందుల వాడకంపై కూడా దృష్టి పెడుతున్నారు. రాష్ట్రాలన్నీ టెస్టింగ్-ట్రాకింగ్-ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తూ కరోనా నివారణకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 25 నాటికీ దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 18,40,445
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 3,66,368
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,07,194
- యాక్టీవ్ కేసులు – 1,45,481
- మొత్తం మరణాల సంఖ్య – 13,389
తమిళనాడు:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 22,87,334
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,06,737
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,51,055
- యాక్టీవ్ కేసులు – 52,273
- మొత్తం మరణాల సంఖ్య – 3,409
ఢిల్లీ:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 9,29,244
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 1,29,531
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,13,068
- యాక్టీవ్ కేసులు – 12,657
- మొత్తం మరణాల సంఖ్య – 3,806
కర్ణాటక:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 11,43,262
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 90,942
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 33,750
- యాక్టీవ్ కేసులు – 55,385
- మొత్తం మరణాల సంఖ్య – 1,798
ఆంధ్రప్రదేశ్:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 15,95,674
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 88,671
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 43,255
- యాక్టీవ్ కేసులు – 44,431
- మొత్తం మరణాల సంఖ్య – 985
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu