మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23, బుధవారం నాడు కొత్తగా 21,029 కరోనా పాజిటివ్ కేసులు, 479 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,63,799 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 33,886 కు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికి 61,06,787 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 23, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 12,63,799
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 9,56,030
- యాక్టీవ్ కేసులు – 2,73,477
- సెప్టెంబర్ 23 న నమోదైన కేసులు – 21,029
- సెప్టెంబర్ 23 న డిశ్చార్జ్ అయినవారు – 19,476
- సెప్టెంబర్ 23 న నమోదైన మరణాల సంఖ్య – 479
- మొత్తం మరణాల సంఖ్య – 33,886
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu