కెనడాలోని భారతీయ పౌరులు మరియు భారత విద్యార్థులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక సూచనలు జారీచేసింది. “కెనడాలో ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస మరియు భారత వ్యతిరేక కార్యకలాపాల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కెనడాలోని దేశ హైకమిషన్/కాన్సులేట్ జనరల్ కెనడియన్ అధికారులతో ఈ సంఘటనలపై మాట్లాడి మరియు పేర్కొన్న నేరాలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారిని అభ్యర్థించారు. కెనడాలో ఈ నేరాలకు పాల్పడిన వారిని ఇంతవరకు న్యాయస్థానం ముందుకు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా, కెనడాలోని భారతీయ పౌరులు మరియు భారతదేశం నుండి విద్యార్థులు మరియు ప్రయాణం/విద్య కోసం కెనడాకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలి” అని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
“కెనడాలోని భారత పౌరులు మరియు విద్యార్థులు కూడా ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా లేదా టొరంటో మరియు వాంకోవర్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో వారి సంబంధిత వెబ్సైట్లు లేదా ఎంఏడీఏడీ పోర్టల్ madad.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదైనా అవసరం లేదా అత్యవసర పరిస్థితుల్లో కెనడాలోని భారతీయ పౌరులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి హైకమిషన్ మరియు కాన్సులేట్ జనరల్లకు రిజిస్ట్రేషన్ ఉపయోగపడనుంది” అని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY