నేడు దేశ రాజధాని ఢిల్లీలో 17 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి పదవికి తమ ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడానికి సమావేశమవుతున్నాయి. ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ అధ్యక్షత వహించనున్నారు. గత సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన సుమారు 20 పార్టీలు వరకు పాల్గొన్నాయి. అప్పుడు తమ అభ్యర్థిగా శరద్ పవార్ పేరు పరిశీలనకు రావడం, దానిని ఆయన తిరస్కరించడం జరిగిపోయాయి. అనంతరం గోపాలకృష్ణ గాంధీ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ పేర్లు వినిపించినా, వారు ఆసక్తి చూపకపోవడంతో మంగళవారం మరోసారి సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. అనూహ్యంగా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా పేరు వినిపించడం విశేషం. ఆయనను తమ అభ్యర్థిగా పోటీలో దించాలని పలువురు విపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల సూచనకు యశ్వంత్ సిన్హా కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా బీహార్కు చెందిన యశ్వంత్ సిన్హా గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నరంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక ఆయనతో విభేదించి బీజేపీకి రాజీనామా చేశారు సిన్హా. అయితే గతేడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY