మాజీ విదేశాంగ మంత్రి నికోస్ క్రిస్టోడౌలిడెస్ సైప్రస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సైప్రస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికారిక ఫలితాల ప్రకారం, క్రిస్టోడౌలిడెస్కు 51.9 శాతం ఓట్లు మరియు అతని ప్రత్యర్థి, ప్రముఖ దౌత్యవేత్త ఆండ్రియాస్ మావ్రోయినిస్కు 48.1% ఓట్లు వచ్చాయి. జాతిపరంగా విభజించబడిన సైప్రస్ ను ఏకీకృత శక్తిగా మార్చుతానని ప్రచారం చేయడంతో నికోస్ క్రిస్టోడౌలిడెస్ పెద్ద సంఖ్యలో ఓటర్లను ఆకట్టుకున్నారు. దేశం నుండి విడిపోయిన టర్కిష్ సైప్రియాట్లతో చర్చలను పునరుద్ధరించడానికి మరియు కేబినెట్ లో సగానికి పైగా మహిళలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు నికోస్ క్రిస్టోడౌలిడెస్ హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సైప్రస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నికోస్ క్రిస్టోడౌలిడెస్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “సైప్రస్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నికోస్ క్రిస్టోడౌలిడెస్ కి అభినందనలు. భారతదేశం-సైప్రస్ సంబంధాలను మెరుగుపరచడానికి నేను అతనితో సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE