ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అభ్యర్థులు/మద్ధతు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు.
వైఎస్సార్సీపీ తరపున శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్.సుధాకర్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నట్టుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఎం.వి.రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నట్టు తెలిపారు.
సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ప్రకటించి, నేతలకు పరిచయం చేశారు. వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యరులు మరియు పార్టీ మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని, వారి విజయం కోసం సంబంధిత జిల్లా నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా నేతలకు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE