ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)/జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం యొక్క 18వ రైజింగ్ డే/వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ధైర్యసాహసాలు మెచ్చుకోదగినవని ప్రధాని ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
“నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు రైజింగ్ డే శుభాకాంక్షలు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేసేందుకు వారు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ధైర్యసాహసాలు మెచ్చుకోదగినవి. విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలను నిర్మించడంతోపాటు విపత్తు నిర్వహణ ఉపకరణాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం అనేక ప్రయత్నాలు చేస్తోంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే 18వ రైజింగ్ డే సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ లోని అన్ని శ్రేణులకు, వెటరన్స్ కు, వారి కుటుంబాలకు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో భయపెట్టే విపత్తు పరిస్థితి లేదా విపత్తుకు ప్రత్యేక ప్రతిస్పందన కోసం విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం 2006 లో కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఒక భారతీయ ప్రత్యేక దళంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం 16 శిక్షణ పొందిన బెటాలియన్లతో కూడిన మల్టీ-డిసిప్లినరీ, హైటెక్ స్పెషలిస్ట్ ఫోర్స్ గా ఎన్డీఆర్ఎఫ్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE