దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 68,020 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644 కు చేరుకుంది. కరోనాతో మరో 291 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,61,843 కి పెరిగింది. దేశంలో మళ్ళీ యాక్టీవ్ కేసుల సంఖ్య 5 లక్షలు (5,21,808) దాటింది. కొత్తగా మహారాష్ట్ర (40414), కర్ణాటక (3082), పంజాబ్ (2870), మధ్యప్రదేశ్ (2276), గుజరాత్ (2270), కేరళ (2216), తమిళనాడు (2194), ఛత్తీస్ ఘడ్ (2153) వంటి 8 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 60,020 కేసులలో 84.5% శాతం ఈ 8 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 94.32 శాతం, మరణాల రేటు 1.34 శాతం:
దేశంలో మరో 32,231 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,13,55,993 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 94.32 శాతం గానూ, మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, లద్దాఖ్, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ