రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ.. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ?

PM Modi Meets President Droupadi Murmu Amid Intense Cabinet Expansion Speculations

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ క్యాబినెట్‌లో భారీ మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయి కీలక సమాలోచనలు జరపడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. జూలై 20వ తేదీ నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా, బుధవారం జరగబోయే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వేదికగా నూతన పరిపాలనా విధివిధానాల అమలుపై ఉభయ సభల వేదికగా తమ పటిష్టమైన సంకల్పాన్ని చాటారు.

రెండు కీలక సహాయ మంత్రి పదవుల ఖాళీ

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న జార్జి కురియన్ బుధవారం తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయనతో పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్‌సింగ్ (రవనీత్ సింగ్ బిట్టు) ల రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. అయితే, ఈ ఇద్దరు నేతలను కేంద్రం తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు.

ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్‌లో ఏకైక క్రైస్తవ మంత్రి అయిన కురియన్ హఠాత్తుగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారగా, ప్రధాని మోదీ వల్లే తనకు ఈ ఊహించని అవకాశం దక్కిందని ఆయన సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఆయనను ఏదైనా ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రులకు పార్టీ బాధ్యతలు.. 33 శాతం మహిళలకు చోటు?

మంత్రివర్గంలో ఉన్న మరికొందరు నేతలకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కేంద్ర రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా, అలాగే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ బాధ్యతలను అప్పగించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో క్యాబినెట్ నుండి మరికొందరికి ఉద్వాసన తప్పదని, కొత్త వారికి భారీగా అవకాశం లభిస్తుందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రాబోయే పునర్వ్యవస్థీకరణలో 33 శాతం మహిళా ఎంపీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారనే ప్రచారం జోరందుకోవడంతో, వివిధ రాష్ట్రాల మహిళా ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలవడం ప్రారంభించారు.

పార్టీ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్

జీ7 సమావేశాలు ముగించుకుని ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా లూధియానాలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించి, గత రెండు రోజులుగా పార్టీ ఆఫీస్ బేరర్లు, నూతన కార్యవర్గ సభ్యుల నియామకాలపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. మంత్రివర్గ మార్పుల కంటే ముందే పార్టీ నూతన కమిటీల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here