టోక్యో పారాలింపిక్స్ లో బాడ్మింటన్ లో భారత్ పతకాల వేట కొనసాగింది. ఆదివారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఆదివారం ఉదయం బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్హెచ్-6 విభాగంలో కృష్ణ నాగర్ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్లో హాంకాంగ్ ఆటగాడు కైమన్ చూపై 21-17, 16-21, 21-17 తేడాతో కృష్ణ నాగర్ విజయం సాధించి భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతాకాన్ని చేర్చాడు. అలాగే బ్యాడ్మింటన్ ఎస్ఎల్-4 విభాగంలో సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు. ఫైనల్ లో ప్రపంచ నంబర్ వన్, ఫ్రాన్స్కు చెందిన లూకాస్ మజుర్ 21-15, 17-21, 15-21 తో సుహాస్ యతిరాజ్ పై గెలుపొందాడు. దీంతో సుహాస్ యతిరాజ్ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పారాలింపిక్స్-2020లో భారత్ మొత్తం పతకాలు సంఖ్య 19 కు (ఐదు స్వర్ణం, ఎనిమిది రజతం, ఆరు కాంస్యాలు) చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ