కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు, ఆది గురువు శంకరాచార్య విగ్రహం ఆవిష్కరణ

Adi Shankaracharya Statue, Kedarnath Temple, Mango News, Modi in Kedarnath live, PM Modi, PM Modi offers prayer at Kedarnath Temple, PM Modi offers prayers at Kedarnath shrine, PM Modi Offers prayers at Kedarnath Temple, PM Modi offers prayers at Kedarnath temple in Uttarakhand, PM Unveils Adi Shankaracharya Statue, Unveils Adi Shankaracharya Statue, Uttarakhand

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిగురువు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా 2013లో కేదార్‌నాథ్‌ లో వరదల వలన ఆది శంకరాచార్య సమాధి ధ్వంసమైంది. దీంతో 2019 లో ఈ సమాధి పునర్నిర్మాణంతో పాటుగా 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఈ పర్యటన సందర్భంగా 35 టన్నుల బరువున్న 12 అడుగుల ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆదిగురువు ముందు కూర్చుని ప్రధాని మోదీ కొద్దిసేపు ధ్యానం చేశారు.

మరోవైపు ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కి శంకుస్థాప‌న‌లు చేశారు. సంగం ఘాట్ పునరాభివృద్ధి, ప్రథమ చికిత్స మరియు టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, అడ్మిన్ ఆఫీస్ మరియు హాస్పిటల్, రెండు అతిథి గృహాలు, పోలీస్ స్టేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మందాకిని ఆస్తపథం క్యూ నిర్వహణ, రెయిన్‌షెల్టర్ మరియు సరస్వతి సివిక్ ఎమినిటీ బిల్డింగ్ సహా రూ.180 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =