ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు బాలిలో జరుగుతున్న 17వ G20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్ఏ) అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది.
క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అధునాతన కంప్యూటింగ్, ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ మొదలైన భవిష్యత్ ఆధారిత రంగాలలో సహకారంతో సహా భారతదేశం-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క నిరంతర చర్యలను ఇరువురూ సమీక్షించారని తెలిపారు. అలాగే క్వాడ్, ఐ2యూ2 మొదలైన కొత్త సమూహాలలో భారతదేశం మరియు యూఎస్ఏ మధ్య సన్నిహిత సహకారం గురించి వారు సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. ఇద్దరు నేతలు సమయోచిత ప్రపంచ మరియు ప్రాంతీయ పరిణామాలపై చర్చించారని తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశం-అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం మద్దతు ఇచ్చినందుకు ప్రెసిడెంట్ బైడెన్కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో రెండు దేశాలు సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తాయన్న విశ్వాసాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE