ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జార్ఖండ్ లోని రాంచీలో భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ ఉద్యాన్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా, దేశంలోని ఆదివాసీల సంప్రదాయాలకు, శౌర్య గాథలకు మరింత అర్థవంతమైన, మరింత గొప్ప గుర్తింపును అందించాలని దేశం నిర్ణయించుకుందని చెప్పారు. ఇందు కోసం, ఈ రోజు నుండి దేశం ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీని అంటే భగవాన్ బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా జరుపుకోవాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడిందన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా జాతికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ప్రారంభించిన మ్యూజియం వైవిధ్యంతో నిండిన మన గిరిజన సంస్కృతికి సజీవ వేదికగా మారుతుందని, స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన వీరులు మరియు వీరుల సహకారాన్ని వర్ణిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ