ప్రపంచవ్యాప్తంగా కరోనా కాలంలో వివాహ బంధాలు విచ్చిన్నం కావడంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు విడిపోతే, అది పసి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన తెలిపారు. అందుకే పెళ్ళైన దంపతులు.. “దయచేసి – ధన్యవాదాలు – క్షమించండి” అనే మూడు ముఖ్యమైన పదాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన వివాహిత జంటలకు లేఖ రాశారు.
“లాక్ డౌన్ మరియు క్వారంటైన్ల కారణంగా కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడపాల్సి వస్తోంది. అయితే, ఇది కొందరిలో సమస్యలను కూడా కలిగిస్తోంది. చాలా మంది దంపతులు సహనం కోల్పోతున్నారు. అపార్ధాలతో వాదనలకు దిగుతున్నారు, చివరకు విడిపోతున్నారు. అయితే, ఈ పరిణామాలు.. తల్లిదండ్రుల నుంచి ప్రేమ, విశ్వాసం, కోరుకొనే పసి మనసులపై ప్రభావం చూపిస్తుంది. వాదన జరిగిన ప్రతిసారి సమస్యను పరిష్కరించుకోకుండా ఆ రోజును ముగించవద్దు” అని పోప్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ