ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 6 జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 27, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,76,546 కు పెరిగింది. ఇక రాష్ట్రంలో కరోనా వలన కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదు, దీంతో మరణాల సంఖ్య 14,490 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 121 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,60,957 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,099 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(54):
- చిత్తూరు – 19
- విశాఖపట్నం – 13
- గుంటూరు – 7
- తూర్పుగోదావరి – 5
- నెల్లూరు – 5
- కృష్ణా – 4
- కర్నూల్ – 1
- పశ్చిమగోదావరి – 0
- శ్రీకాకుళం – 0
- అనంతపూర్ – 0
- ప్రకాశం – 0
- కడప – 0
- విజయనగరం – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ