మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఫిబ్రవరి 3, బుధవారం నాడు 2992 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,33,266 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,169 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 7030 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,43,335 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.58 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.52 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 37,516 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. బుధవారం నాటికి మహారాష్ట్రలో 1,47,64,744 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ