ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన సేవలను మరింతగా విస్తరించింది. గతంలో ప్రకటించినట్లుగా, దేశంలో నెక్స్ట్ జనరేషన్ హై-స్పీడ్ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ శనివారం రాజస్థాన్లోని రాజ్సమంద్లోని ప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం 5జీ సేవలను ప్రారంభించారు. దీంతో త్వరలోనే దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ సంవత్సరం రిలయన్స్ జియో ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం ఆపరేటర్ తన 5జీ నెట్వర్క్ను 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తహసీల్ మరియు తాలూకాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆగస్టు 29న భారతదేశంలో 5జీ లాంచ్ను ప్రకటించారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో బోర్డు నుండి రాజీనామా చేసి తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి పాలనను అప్పగించారు. ఇక ఆరేళ్ల క్రితం ప్రారంభించిన జియో అతి తక్కువ వ్యవధిలో అతిపెద్ద 4జీ నెట్వర్క్ను విడుదల చేసిన సమయంలో బహుళ ప్రపంచ రికార్డులను సృష్టించింది. జియో యొక్క 4G నెట్వర్క్ 400 మిలియన్లకు పైగా నమ్మకమైన మరియు సంతోషించిన కస్టమర్లకు అత్యధిక నాణ్యత, అత్యంత సరసమైన డిజిటల్ సేవలను అందిస్తుంది. ఇక రిలయన్స్ కంపెనీ 5జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. కొన్ని వారాలక్రితం టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన వేలంపాటలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొన్ని ప్రత్యేక బ్యాండ్లలో స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY