భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్-2022 ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మేరకు ఆమె సెమీ-ఫైనల్లో వరల్డ్ నెంబర్ 38వ స్థానంలో ఉన్న జపాన్ క్రీడాకారిణి సయినా కవాకమిపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో పీవీ సింధు 21-15, 21-7 స్కోరు తేడాతో వరుస సెట్లను గెలుచుకుంది. తొలి సెట్ నుంచే ప్రత్యర్ధిపై పైచేయి సాధించిన సింధు.. కేవలం 32 నిమిషాల్లోనే గేమ్ను ముగించింది. ఫోర్హ్యాండ్ అటాకింగ్ రిటర్న్స్తో పాటు బ్యాక్హ్యాండ్ ఫ్లిక్స్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపించిన సింధు తుదిపోరుకు అర్హత సాధించింది. కాగా పీవీ సింధు సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిల్స్ (సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్) గెలుచుకుంది. దీనికి ముందు క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ