భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (జూలై 17, ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనుంది. ఈ సర్వేలో సీఎం కేసీఆర్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు. మరోవైపు ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY