తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆగస్టు 6, గురువారం నాడు ఒక్కరోజే 110 కరోనా మరణాలు, 5684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,144 కి చేరగా, మరణాల సంఖ్య 4571 కి పెరిగింది. మరోవైపు గురువారం నాటికీ రాష్ట్రంలో 30,20,714 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 6, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,79,144
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,21,087
- యాక్టీవ్ కేసులు – 53,486
- ఆగస్టు 6 న నమోదైన కేసులు – 5684
- ఆగస్టు 6 న డిశ్చార్జ్ అయినవారు – 6272
- ఆగస్టు 6 న నమోదైన మరణాల సంఖ్య – 110
- మొత్తం మరణాల సంఖ్య – 4571
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu