ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆగస్టు 6, గురువారం నాడు ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 196789 కు చేరగా, మరణాల సంఖ్య 1753 కి పెరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్ జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 27580, కర్నూల్ జిల్లాలో 23348, అనంతపూర్ లో 21173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరో 8516 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 112870 కి చేరింది. ప్రస్తుతం 82166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 27580
- కర్నూల్ – 23348
- అనంతపూర్ – 21173
- గుంటూరు – 19419
- విశాఖపట్నం – 16682
- పశ్చిమ గోదావరి – 15786
- చిత్తూరు – 14306
- కడప – 11493
- నెల్లూరు – 10705
- శ్రీకాకుళం – 9636
- కృష్ణా – 9042
- విజయనగరం – 7468
- ప్రకాశం – 7256
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu