ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 25, శనివారం సాయంత్రానికి 1778 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 26 మంది మరణించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో మరింతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
కరోనా నేపథ్యంలో యూపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు:
- జూన్ 30 వరకు సమావేశాల నిర్వహణకు అనుమతి రద్దు.
- రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమావేశాలకు అనుమతి లేదు.
- ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్లపై జనం గుమికూడకూడదు.
- లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తర్ప్రదేశ్ కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు.
- కరోనా నేపథ్యంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనల్ని నిర్వహించుకోవాలి.
- రాష్ట్రంలో మతపరమైన సామూహిక సమావేశాలకు అనుమతి లేదు.
- తబ్లిగీ జమాత్తో సంబంధం ఉన్నవారు ఇంకెవరైనా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]