భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30548 పాజిటివ్ కేసులు, 435 మరణాలు నమోదవడంతో ఈ రోజు ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 88,45,127 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,30,070 కి పెరిగింది. ఇక గత కొన్ని రోజులుగా దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 5 లక్షల కంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 4,65,478 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 43,851 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 82,49,579 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 93.27 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.47 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 16, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 88,45,127
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 15–నవంబర్ 16 (8AM-8AM)] : 30548
- నమోదైన మరణాలు : 435
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 82,49,579
- యాక్టీవ్ కేసులు : 4,65,478
- మొత్తం మరణాల సంఖ్య : 1,30,070
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ