తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పరుచూరి గోపాల కృష్ణ గారు ఎనిమిదో పాఠంలో సినిమాల్లో ప్రధాన పాత్రల గురించి వివరించారు. సాధారణంగా ప్రధాన పాత్రలంటే కథానాయకుడు, కథానాయిక పాత్రలేనని, అయితే కొన్ని సినిమాల్లో ఒకటికి మించి ప్రధాన పాత్రలు ఉంటాయని, సినిమా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇవి కీలకంగా ఉంటాయని చెప్పారు. అత్తారింటికి దారేది లో నదియా పాత్ర, శతమానం భవతిలో ప్రకాష్ రాజ్ పాత్ర, జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ పాత్రల గురించి, వాటి ప్రభావం గురించి ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]