టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌‌కు భారీ ప్రమాదం.. పలువురు రిపోర్టర్లకు గాయాలు

6 Cars Collided In TPCC Chief Revanth Reddy Convoy At Sircilla Today Several Journalists Injured,6 Cars Collided At Sircilla Today,TPCC Chief Revanth Reddy,Several Journalists Injured At Sircilla,TPCC Chief Revanth Reddy Convoy Collided,Mango News,Mango News Telugu,Narrow Escape For Telangana Congress Chief,TPCC Chief Revanth Reddy,Revanth Reddy Latest News And Updates,Telangana Congress News,TPCC Chief Revanth Reddy News

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదానికి గురైంది. సిరిసిల్ల జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శ్రీపాద ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో కార్లు ప్రమాదవశాత్తు వరుసగా ఢీ కొట్టుకున్నాయి. రేవంత్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాన్వాయ్‌లో ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో వెనుకగా వస్తున్న ఏడు కార్లు వరుసగా ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌లోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని నాలుగు కార్లు సహా పలు మీడియా సంస్థలకు చెందిన మరో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో నలుగురు రిపోర్టర్లు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటన అనంతరం రేవంత్ రెడ్డి ఇంకో కారులో శ్రీపాద ప్రాజెక్ట్ సందర్శనానికి వెళ్లారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =