కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు 73 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో అర్చకులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. దీంతో భక్తులకు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందకుండా నివారించడం కోసం ఏప్రిల్ 3, శనివారం వరకు భక్తులచే జరిపించు ఆర్జిత సేవలు మరియు అన్నప్రసాదం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శ్రీ స్వామివారి నిత్యపూజలన్నియు అంతరంగికరముగా నిర్వహించుచూ, కేవలం భక్తులకు లఘు దర్శనం కల్పించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ