నేడు ‘గుడ్ఫ్రైడే’ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రజల కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. ‘గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు పవిత్రమైన రోజు. మానవాళికి సార్వత్రిక సోదరభావాన్ని పెంపొందించడంలో యేసుక్రీస్తు బోధలు సహాయపడతాయి. సిలువపై తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు. ఆయన జీవితంలో పాటించిన నిస్సహాయుల పట్ల జాలి, అవధులులేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను ప్రతి ఒకరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని అన్నారు.
ఇక ఏపీ సీఎం జగన్.. ‘గుడ్ ఫ్రైడే యేసు పునరుత్థానాన్ని సూచించే ఈస్టర్ ఆదివారం ముందు శిలువ వేయడాన్ని సూచిస్తుంది. ఇది మానవజాతి పట్ల బేషరతు ప్రేమ, పేదవారి పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాపణ మరియు ఆదర్శప్రాయమైన సహనం మరియు అపరిమితమైన త్యాగంతో బాధలను సహించడాన్ని సూచిస్తుంది. ఇది మానవాళికి క్రీస్తు సందేశం, ఇది సమయం మరియు ప్రదేశంలో విశ్వవ్యాప్త ప్రాముఖ్యతను కలిగి ఉంది’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాగా గుడ్ఫ్రైడేను ప్రజలు భక్తిశ్రద్ధలతో, దైవప్రార్థనలతో జరుపుకోవాలని, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE