ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 30, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,00,805 కు చేరింది. కొత్తగా గుంటూరు జిల్లాలో అత్యధికంగా 198, చిత్తూరులో 179, కృష్ణాలో 176, విశాఖపట్నంలో 169 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 480 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన గుంటూరు, కృష్ణా మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7213 కి పెరిగింది. గత 24 గంటల్లో 30,851 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,50,52,215 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 30, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,00,805
- కొత్తగా నమోదైన కేసులు : 993
- కొత్తగా నమోదైన మరణాలు : 3
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,86,978
- యాక్టీవ్ కేసులు : 6614
- మొత్తం మరణాల సంఖ్య : 7213
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ