ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. అలాగే రావెల కిశోర్ తనతో కలిసి జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని సీఎం కేసీఆర్ తెలిపారు. చింతల పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటామని సీఎం అన్నారు.
ఏపీ నుంచి ఇటువంటి విద్యావంతులు, ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం మంచి శుభారంభమని, తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, చింతల పార్ఠసారథి మీద మరిన్ని బరువు బాధ్యతలు పెట్టనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి పనిని ప్రారంభించుకుంటున్నామని, ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నానని అన్నారు. తోట చంద్రశేఖర్ ఈ బాధ్యతలను స్వీకరించాలని, కర్తవ్య నిర్వహణలో పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అలాగే ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE