రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త అందించారు. ఉపాధ్యాయుల బదిలీలకు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు తెలిపారు.
“విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికి సీఎం కేసీఆర్ శుభవార్త తెలియజేశారు. విద్యా శాఖ తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్ఫర్స్ కు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేయమని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆదివారం కొంత కసరత్తు చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే చేశామో, వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే ఈ ప్రక్రియ చేపట్టనున్నాం. మొదటగా హెడ్ మాస్టర్స్ కు ట్రాన్ఫర్స్ ఇచ్చిన తరువాత, అంచలవారీగా ప్రమోషన్స్ ఉంటాయి. 9,266 పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్, వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేయమని సీఎం కేసీఆర్ చెప్పారు, త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. అయితే ఇప్పుడు ప్రమోషన్స్, ట్రాన్ఫర్స్ ఇచ్చినప్పటికీ పిల్లలకు సంబంధించి విద్యకు ఇబ్బంది కలగకుండా, పదో తరగతి పరీక్షలు అయిపోయాక ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చేలా ఆదేశాలు ఇవ్వనున్నాం. రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటి తర్వాత మోడల్ స్కూల్స్ కు సంబంధించి కూడా ప్రమోషన్స్ చేపట్టనున్నాం. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, ఎలాంటి అపోహలకు తావు లేకుండా జరగనుంది” అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE