నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ చెందిన ట్విన్-ఇంజిన్ ఏటీఆర్ 72 విమానం ఖాట్మండు నుండి పోఖారాకు వెళుతుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సహా మొత్తం 72 మంది ఉన్నారు. గత మూడు దశాబ్దాలలో నేపాల్ లో జరిగిన ఈ అత్యంత ఘోర విమాన ప్రమాదంలో 66 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, మరణాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 5 గురు భారతీయులు ఉండగా, నలుగురు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్టు గుర్తించారు
ఈ నేపథ్యంలో నేపాల్లో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “నేపాల్లో జరిగిన విషాద విమాన ప్రమాదంలో భారతీయ పౌరులతో సహా విలువైన ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మరియు ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE