ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు, కిడ్నీ సమస్యలు కూడ తలెత్తడంతో కుటుంబసభ్యులు ఈ నెల 6వ తేదీన యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం నాడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో వేణుమాధవ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు రాజశేఖర్, జీవితా రాజశేఖర్, ఉత్తేజ్ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
Home తెలంగాణ
- Advertisement -