తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 23, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 6,80,251 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,018 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక గురువారం నాడు 38,219 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 190 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,72,637 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,596 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 38గా ఉంది. కొత్తగా రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. కాగా గత 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 648 మంది వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలినట్టు చెప్పారు. దీంతో వారి శాంపిల్స్ ను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, మొత్తం 10 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ