ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆదివారం నాడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలిపారు. దీంతో వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు ఆయన స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని చెప్పారు. కాగా వెంకయ్యనాయుడుకి కరోనా సోకడం ఇది రెండోసారి, సెప్టెంబర్ 2020 లో ఓసారి ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖులు ట్వీట్స్ చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,95,43,328 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF