తెలంగాణలో రాష్ట్రంలో జూలై 18, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,780 కు చేరింది. శనివారం నాడు మరో 1284 కేసులు నమోదు కాగా, 14,883 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 409 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1902 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 30,607 కి చేరింది. ప్రస్తుతం 12,765 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.93 (< 1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1284):
- జీహెచ్ఎంసీ – 667
- సంగారెడ్డి – 86
- రంగారెడ్డి – 68
- మేడ్చల్ – 62
- కరీంనగర్ – 58
- నల్గొండ – 46
- వరంగల్ అర్బన్ – 37
- వికారాబాద్ – 35
- నిజామాబాద్ – 26
- వనపర్తి – 24
- సూర్యాపేట – 23
- సిద్దిపేట – 22
- మంచిర్యాల – 19
- మహబూబ్నగర్ – 16
- మెదక్ – 15
- పెద్దపల్లి – 14
- జోగుళాంబ గద్వాల – 14
- ఖమ్మం – 10
- యాదాద్రి భువనగిరి – 10
- ఆదిలాబాద్ – 8
- జనగామ – 6
- వరంగల్ రూరల్ – 5
- జయశంకర్ భూపాలపల్లి – 4
- కామారెడ్డి – 2
- రాజన్న సిరిసిల్ల – 2
- ఆసిఫాబాద్ – 2
- నిర్మల్ – 1
- నాగర్కర్నూల్ – 1
- జగిత్యాల – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu