హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకి మరింతగా వేడెక్కుతుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనపై పోటీచేసి గెలవాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. హుజూరాబాద్ మండలం చెల్పూరు పంచాయతీకి చెందిన ముదిరాజ్లు భారీ సంఖ్యలో ఆదివారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ను, హరీశ్రావును వచ్చి హుజూరాబాద్ లో పోటీచేసి తనపై గెలవాలని సవాల్ విసిరారు.
బక్కపల్చని పిల్లగాడని, దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నారు, కానీ హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డనని గుర్తు పెట్టుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పేరిట రూ.5వేల కోట్ల నిధుల మంజూరుకు జీవోలు, ఎన్నికల్లో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తారంట, అయినా ఫర్వాలేదని, ఎన్నికల్లో చూసుకుందామని ఈటల వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్ లో పదవులు అడుక్కుంటే రాలేదని, పనిచేయబట్టే వచ్చాయన్నారు. తనపై కక్షగట్టి మంత్రివర్గం నుంచి తప్పించారని, తాను మచ్చలేని వ్యక్తినని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ