కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నికకు నేడు (అక్టోబర్ 1, శుక్రవారం) నోటిఫికేషన్ జారీ కానుండగా, నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుకానుంది. ఈ నేపథ్యంలో గురువారం పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి మరియు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఈ ఉపఎన్నికలో పార్టీ ప్రచారం కోసం పార్టీ ఫండ్ నుంచి రూ.28 లక్షల చెక్కును గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా అన్నివర్గాల ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని గెల్లు శ్రీనివాస్ కు సీఎం సూచించారు. హుజూరాబాద్ లో ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటారని, తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడే నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ