తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలకు అనుకూలమైన నగరంగా ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ కంపెనీకి ప్రధమ గమ్యస్థానంగా మారింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. గ్రిడ్ డైనమిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ భారత్లో మొదటి యూనిట్ను ఏర్పాటు చేస్తోందని, దానికి ఫస్ట్ ఛాయస్ గా హైదరాబాద్ను ఎంచుకుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మంత్రి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Hyderabad continues to be the hotbed for Multinational Companies!! Met with Leonard Livschitz, CEO @GridDynamics a digital transformation company with offices across the US & Europe
GRID DYNAMICS opens its first presence in India with headcount to reach 1,000 by end of the year pic.twitter.com/UdopmoLf0X
— KTR (@KTRTRS) May 9, 2022
ఈరోజు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో ‘గ్రిడ్ డైనమిక్స్’ కంపెనీ సీఈవో లివ్ చిట్జ్ బృందం కలిసింది. త్వరలోనే హైదరాబాద్లో తమ కంపెనీ మొదటి యూనిట్ను ఏర్పాటు చేస్తామని మంత్రికి తెలియజేశారు. అమెరికా మరియు యూరప్ దేశాలలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో గ్రిడ్ డైనమిక్స్ కంపెనీకి ఎంతో పేరుందని, అలంటి కంపెనీ ఇప్పుడు మన దగ్గర కూడా యూనిట్ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిందని, దీని ద్వారా దాదాపు 1,000 మందికి ఉపాధి కలుగనుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ