ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లీగ్ మ్యాచ్లు మే 22వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ క్రమంలో గాయాలతో పలువురు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎడమ ముంజేయి కండరాల గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ముంబయి జట్టు ఆడే మిగతా మ్యాచులకు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండడు. ఈ మేరకు ఐపీఎల్ టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. మే 6న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడని తెలిపారు.
సూర్య కుమార్ ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరఫున 8 మ్యాచ్లు ఆడి 43.29 సగటుతో 303 పరుగులు చేయగా, అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్ 2022లో ముంబయి జట్టు అంచనాలకు తగినట్టుగా రాణించలేదు. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన ముంబయి జట్టు, రెండు విజయాలు సాధించగా, ఎనిమిది మ్యాచుల్లో పరాజయం పాలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ