ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా? ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో సంచలనం సృష్టించే మస్క్ ఈరోజు మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈసారి అతని మరణం గురించి మాట్లాడటం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసాడు. మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను $44 బిలియన్లకు కొనుగోలు చేయాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించిన ఒక వారం తర్వాత ఈ ట్వీట్ చేయడంతో కొత్త ఊహాగానాలకు దారితీసింది. “నేను ఒకవేళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే.. అది మీకు తెలుసుకోవడం సంతాషాన్నిస్తుంది” అని మస్క్ ఈ రోజు ట్వీట్ చేశాడు.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
— Elon Musk (@elonmusk) May 9, 2022
అయితే దీనికి కొద్దిసేపటి ముందు మస్క్ మరో ట్వీట్ లో.. “ఉక్రెయిన్లోని ఫాసిస్ట్ శక్తులకు సైనిక కమ్యూనికేషన్ పరికరాలను సరఫరా చేయడంలో నిమగ్నమై ఉన్నాను” అని చెప్పే కమ్యూనికేషన్ పోస్ట్ను పంచుకున్నారు. దీంతో అతను ఉక్రెయిన్ దేశానికి సహాయం చేస్తున్నందున తనపై రష్యా ఆగ్రహంగా ఉందన్న విషయాన్ని నిగూఢంగా చెప్పాడన్న వాదన వినిపిస్తోంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం అయిన పెంటగాన్ ద్వారా ఈ పరికరాలు ఉక్రెయిన్లో డెలివరీ చేయబడిందని కమ్యూనికేషన్ పేర్కొంది. ఈ రెండు పోస్ట్లు యుద్ధంలో ఉక్రెయిన్కు సహాయం చేసినందుకు రష్యా నుండి టెస్లా సీఈఓ దిరింపులను ఎదుర్కొంటున్నారా అనే ఊహాగానాలకు దారితీసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ