తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో కేసుల సంఖ్య 30 వేలు దాటింది. రాష్ట్రంలో మరో 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 9, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 30,946 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 5,954 శాంపిల్స్ పరీక్షించగా 4,544 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 331 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 913 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18,192 కి చేరింది. ప్రస్తుతం 12,423 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1410):
- జీహెచ్ఎంసీ ఏరియా – 918
- రంగారెడ్డి – 125
- సంగారెడ్డి – 79
- మేడ్చల్ – 67
- వరంగల్ అర్బన్ – 34
- కరీంనగర్ – 32
- భద్రాద్రి కొత్తగూడెం – 23
- నల్గొండ – 21
- నిజామాబాద్ – 18
- మెదక్ – 17
- ఖమ్మం – 12
- సూర్యాపేట – 10
- మహబూబ్ నగర్ – 8
- రాజన్న సిరిసిల్ల – 8
- వరంగల్ రూరల్ – 7
- జయశంకర్ భూపాలపల్లి – 6
- మహబూబాబాద్ – 5
- వికారాబాద్ – 5
- యాదాద్రి – 2
- కామారెడ్డి – 2
- వనపర్తి – 2
- గద్వాల్ – 2
- జనగామ – 2
- జగిత్యాల – 1
- ఆదిలాబాద్ – 1
- పెద్దపల్లి – 1
- ములుగు – 1
- సిద్ధిపేట – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu