మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా 20 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కూడా కొత్తగా 24,645 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,04,327 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 53,457 కు పెరిగింది. అలాగే మరో 19,463 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 22,34,330 కు చేరింది. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో 2,15,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (మార్చి 22, సోమవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 1,84,62,030
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 25,04,327
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 22,34,330
- యాక్టీవ్ కేసులు – 2,15,241
- మార్చి 22 న నమోదైన కేసులు – 24,645
- మార్చి 22 న డిశ్చార్జ్ అయినవారు – 19,463
- మార్చి 22 న నమోదైన మరణాలు – 58
- మొత్తం మరణాల సంఖ్య – 53,457
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ