భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 25 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 15, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే కొత్తగా 29,429 కరోనా కేసులు, 582 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో అత్యధికంగా ఇన్ని కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 63.24 శాతం ఉండగా, మరణాల రేటు 2.6 శాతంగా ఉంది. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 15, ఉదయం 8 గంటల వరకు) :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,36,181
కొత్తగా నమోదైన కేసులు (జూలై 14 – జూలై 15 (8AM-8AM) : 29,429
నమోదైన మరణాలు : 582
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 5,92,032
యాక్టీవ్ కేసులు : 3,19,840
మొత్తం మరణాల సంఖ్య : 24,309
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu