రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా, స్మైల్ ఎ గిఫ్ట్ లో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఇచ్చిన 14 అంబులెన్స్ వాహనాల్లో 4 వాహనాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తో కలిసి ఆగస్టు 31, సోమవారం నాడు వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కేటిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, కరోనా బాధితులకు అండగా ఉండేందుకు వీలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 14 అంబులెన్స్ వాహనాలను ఎమ్మెల్యేలు, మేయర్ తదితరులంతా కలిసి ఇచ్చారన్నారు. వాటిని ఇటీవలే కేటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించామని, అయితే వరంగల్ లో ఈ రోజు 4 వాహనాలను ప్రారంభించినట్లు చెప్పారు. అందులో ఒకటి భూపాలపల్లికి, ఒకటి జనగామకి, మరో రెండు వాహనాలు పాలకుర్తి నియోజకవర్గానికి కేటాయించామన్నారు. భూపాలపల్లి వాహనాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామ వాహనాన్ని మేయర్ గుండా ప్రకాశ్ రావు, పాలకుర్తి వాహనాలను ఒద్దిరాజు రవిచంద్ర, సంతోశ్ రెడ్డిలు ఇచ్చారని, వారికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మిగతా వాహనాలు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu