నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ శనివారం నాడు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకారం తెలిపిన మంత్రి హరీశ్ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎగ్జిబిషన్ సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సభ్యుల సహకారంతో సొసైటీని ముందుకు తీసుకెళుతానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహకారంతో నుమాయిష్ను విశ్వవ్యాప్తం చేస్తామని హరీశ్ రావు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. గత 80 ఏళ్లుకు పైగా ఈ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్యను, శిక్షణను అందిస్తున్నారు. కాగా 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ కొనసాగుతుండగా, ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ